Thursday 6 March 2014

జోల పాట

"శ్రీ పాండు రంగ భక్త మాలకీర్తనలు " పుస్తకము నందు గల జోల పాట మీ కొరకు 

పల్లవి : జో అచ్యుతా నంద జోజో ముకుందా! 
           రార పరమానంద రామ గోవిందా !! జోజో!!

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించి! నాలుగు వేదములు గొలుసుల మరించి !
బలువైన ఫణిరాజు పాన్పునమరించి! చెలియ డోలికపైని చేరిలాలించి !! జోజో!!

తొమ్మిది వాకిళ్ళ తొట్టిలోపలను ! క్రూరులు ఆరుగురు సాధులైదుగురు!
అందులో ముగ్గురు మూర్తులున్నారు! తెలిసి తెలిపే వాడు దేవుడున్నాడు !! జోజో!!

పట్టువలె నలుగురిని పదిలంబుగాను! కట్టవలె ముగ్గురిని కదలకుండగను 
వుంచవలె ఒక్కరిని హృత్కమల మందు! వుండవలె పండువెన్నెల బయలలోను !! జోజో!!

యీడు గలవానిని కూడుండ వలెను! జోడుగల వానిచే జాడ గనవలెను
మేడ మీదను వుండె మహిమ గనవలెను! కోరి యా గోవిందు గురుని గనవలెను !! జోజో!!

వీధి నొక బాటలో గీతంబు శాయ ! కోటలోభేరి మృదంగంబులు మ్రోయు
కోట కావలి వాండ్రు కోలాట మేయు! ధీటు లేని ప్రభువు దొరతనము శాయ !! జోజో!!

ఓంకార మని యేటి ఒక తొట్టిలోను ! తత్వమని యేటి చలువలంబరచి
వేడ్క తో పావనీ యేర్పాటు జేసి! యేడు భువనముల వారేక మై పాడే !! జోజో!!

No comments:

Post a Comment